వాట్సాప్ తన ఐఓఎస్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే అప్డేట్ను తీసుకొచ్చింది.
వాట్సాప్ తన ఐఓఎస్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే అప్డేట్ను తీసుకొచ్చింది. చాటింగ్ చేసేటప్పుడు మన ఫీలింగ్స్ని వ్యక్తపరచడానికి ఎమోజీలు వాడటం కామన్, కానీ ఇప్పుడు ఆ ఎమోజీలకు తగ్గట్టుగా స్టిక్కర్లను కూడా యాప్ సజెస్ట్ చేస్తోంది. అంటే మీరు ఏదైనా ఒక ఎమోజీని టైప్ చేయగానే, దానికి రిలేటెడ్ సెట్ అయ్యే స్టిక్కర్లు నేరుగా మీ కళ్లముందే కనిపిస్తాయి. దీనివల్ల ప్రతిసారి స్టిక్కర్ కీబోర్డ్ ఓపెన్ చేసి, వందల కొద్దీ ప్యాక్స్లో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్ ఫీచర్ వల్ల యూజర్లకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సంభాషణలు మరింత ఫన్నీగా, కలర్ఫుల్గా మారే అవకాశం ఉంది. మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్ఫారమ్ లేటెస్ట్ వర్షన్ 26.8.76 ద్వారా ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తోంది.
ఈ కొత్త అప్డేట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం యూజర్ ఎక్స్పీరియన్స్ని మరింత సింపుల్గా మార్చడమే. మీరు చాట్ బార్లో ఒక లాఫింగ్ ఎమోజీని ఎంటర్ చేస్తే, దానికి తగినట్టుగా నవ్వుతున్న స్టిక్కర్లు డిస్ప్లే అవుతాయి. అలాగే హార్ట్ ఎమోజీ ఇస్తే లవ్ అండ్ అఫెక్షన్ రిలేటెడ్ స్టిక్కర్లు వెంటనే పాప్-అప్ అవుతాయి. ఒకవేళ మీకు నచ్చిన స్టిక్కర్ అక్కడ కనిపించకపోతే, 'షో మోర్ రిజల్ట్స్' పై క్లిక్ చేయడం ద్వారా థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్స్ను కూడా మీరు ఈజీగా బ్రౌజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుత జనరేషన్ ఫాస్ట్ మెసేజింగ్ను కోరుకుంటోంది కాబట్టి, వాట్సాప్ ఈ మార్పును ప్రవేశపెట్టింది. గతంలో మనం ఏదైనా ఒక మంచి స్టిక్కర్ పంపాలి అంటే, సెర్చ్ బార్లో వెతకడమో లేదా పాత స్టిక్కర్లను స్క్రోల్ చేయడమో చేసేవాళ్లం. కానీ ఇప్పుడు జస్ట్ ఒక ఎమోజీతో మనకు కావాల్సిన స్టిక్కర్ని పట్టేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే కొంతమంది ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రాగా, రాబోయే కొద్ది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన యూజర్లందరికీ ఇది చేరుకుంటుంది. ఈ అప్డేట్ వల్ల చాటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా, మన ఎమోషన్స్ను మరింత పర్ఫెక్ట్గా అవతలి వ్యక్తికి తెలియజేయడానికి వీలవుతుంది. ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తమ యాప్ను లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ను ఎంజాయ్ చేయవచ్చు.
వాట్సాప్ కేవలం స్టిక్కర్లకే పరిమితం కాకుండా, గ్రూప్ చాట్స్లో కూడా ఒక భారీ మార్పును తీసుకొచ్చింది. గ్రూప్ మెసేజ్ హిస్టరీ అనే ఫీచర్ ద్వారా ఇకపై కొత్తగా గ్రూప్లో చేరే సభ్యులు కూడా తాము జాయిన్ అవ్వకముందు జరిగిన సంభాషణలను చూడవచ్చు. సాధారణంగా పాత మెసేజ్లు కొత్తవారికి కనిపించవు, కానీ ఈ ఫీచర్ వల్ల గ్రూప్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఆర్గనైజేషన్లు, కాలేజీ గ్రూపులలో ఈ ఫీచర్ చాలా కీలకం కానుంది. ఇలా వరుస అప్డేట్లతో వాట్సాప్ తన ప్రత్యర్థి యాప్స్కు గట్టి పోటీనిస్తోంది. యూజర్ల ప్రైవసీని కాపాడుతూనే సరికొత్త సౌకర్యాలను కల్పించడంలో మెటా తనదైన ముద్ర వేస్తోంది.
భారతీయ యూజర్ల కోసం వాట్సాప్ మరో సెక్యూరిటీ అప్డేట్పై వర్క్ చేస్తోంది, అదే సిమ్ బైండింగ్. ఈ ఫీచర్ రావడం వల్ల వాట్సాప్ అకౌంట్ సెక్యూరిటీ మరింత పటిష్టం అవుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ ఫ్రాడ్స్, అకౌంట్ హ్యాకింగ్స్ పెరుగుతున్న తరుణంలో, ఫోన్ నంబర్ను నేరుగా సిమ్ కార్డ్తో లింక్ చేయడం ద్వారా అనధికారిక లాగిన్లను అడ్డుకోవచ్చు. కేవలం మెసేజింగ్ మాత్రమే కాకుండా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు కూడా వాట్సాప్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి భద్రతా చర్యలు చాలా అవసరం. ఇండియన్ యూజర్ల డేటా, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ను త్వరలోనే రోల్ అవుట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాట్సాప్ తన ప్లాట్ఫారమ్లో ఒక ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీనికి 'వాట్సాప్ ప్లస్' అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది ఆప్షనల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే, అంటే సాధారణ యూజర్లు ఎప్పటిలాగే వాట్సాప్ను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ఈ ప్రీమియం వెర్షన్ తీసుకునే వారికి అదనపు కస్టమైజేషన్ ఫీచర్లు ,మరింత అనుకూలమైన ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్ఫారమ్ల కోసం ఈ టయర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ కేవలం ఒక చాటింగ్ యాప్లానే కాకుండా, బిజినెస్, పర్సనల్ లైఫ్లో ఒక పవర్ ఫుల్ టూల్లా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రకటన
ప్రకటన