సంచార్ సాథి యాప్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం, ముందస్తుగా డౌన్‌లోడ్ చేసుకోనవసరం లేదని ప్రకటన

సంచార్ సాథి యాప్‌ ఇన్‌స్టలేషన్‌పై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కొత్త, లేదా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో తయారీదారులు సంచార్ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది.

సంచార్ సాథి యాప్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం, ముందస్తుగా డౌన్‌లోడ్ చేసుకోనవసరం లేదని ప్రకటన

Photo Credit: Department of Telecommunications

సంచార్ సాథీ యాప్ భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది

ముఖ్యాంశాలు
  • సంచార్ సాథీ తొలగించగల యాప్ అని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • సంచార్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న 1.4 కోట్ల మంది భారతీయులు
  • స్పామ్ కాల్స్ సమస్యను తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యం
ప్రకటన

కొత్త, లేదా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో తయారీదారులు సంచార్ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంచార్ సాథీ యాప్ వాడకం తప్పనిసరి కాదని, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌ను తొలగించవచ్చని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశంలోని తన స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలనే ఇప్పుడు తొలగించబడిన ఆదేశాన్ని ఆపిల్ వ్యతిరేకించాలని యోచిస్తున్నట్టు ఇటీవలి నివేదిక సూచించింది. దేశంలో 1 కోటి మందికి పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్న సంచార్ సాథీ యాప్ 'పెరుగుతున్న ఆమోదం' కారణంగా ప్రభుత్వం తన తాజా నిర్ణయం తీసుకుందని చెబుతోంది. సంచార్ సాథీని 1.4 కోట్ల మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వం
సంచార్ సాథి యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసుకోవడం ఇకపై తప్పనిసరి కాదని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. భారతదేశంలో దాదాపు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, ప్రతిరోజూ 2,000 మోసపూరిత సంఘటనల గురించి సమాచారాన్ని అందించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాప్ డౌన్‌లోడ్‌లు పెరుగుతున్నందున, దాని ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి చేయాలనే నిర్ణయం ఇకపై అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మంగళవారం మాట్లాడుతూ సంచార్ సాథీ యాప్ ఐచ్ఛికమని, వినియోగదారులు ఇతర యాప్‌ల మాదిరిగానే దీన్ని యాక్టివేట్, డీయాక్టివేట్ చేయవచ్చని అన్నారు. “మీరు మీ ఇష్టానుసారం దీన్ని యాక్టివేట్ చేయవచ్చు లేదా డీయాక్టివేట్ చేయవచ్చు... మీకు సంచార్ సాథీ వద్దనుకుంటే, మీరు దానిని తొలగించవచ్చు. ఇది ఐచ్ఛికం” అని మంత్రి ANIకి తెలిపారు.

రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో విక్రయించే ఐఫోన్ యూనిట్లలో సంచార్ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనే ప్రభుత్వ సూచనలను కోర్టుకు వెళ్లకుండా లేదా బహిరంగంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వ్యతిరేకించాలని ఆపిల్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వారం ప్రారంభంలో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను సెటప్ చేసేటప్పుడు సంచార్ సాథీ యాప్ కనిపించేలా క్రియాత్మకంగా, ప్రారంభించబడాలని తయారీదారులకు DoT సూచించింది. ఆ సమయంలో కంపెనీలకు ఆదేశాన్ని పాటించడానికి 90 రోజులు, సమ్మతి రిపోర్ట్‌ను సబ్మిట్ చేయడానకి అదనంగా 30 రోజులు సమయం ఇవ్వబడింది.

ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో సంచార్ సాథీని ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. కాబట్టి యాప్‌ను ఉపయోగించాలనుకునే వినియోగదారులు దానిని Google Play స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. షావోమిపై అదిరే ఆఫర్.. 14 సివి మోడల్‌పై 16 వేల తగ్గింపు
  2. మార్కెట్లోకి రానున్న సామ్ సంగ్ ట్యాబ్ ఎస్12, గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, గెలాక్సీ వాచ్ 9.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
  3. ఇటీవల పెరుగుతున్న లీక్‌లు, సర్టిఫికేషన్లు ఈ టైమ్‌లైన్‌కు బలం చేకూరుస్తున్నాయి.
  4. ఇవన్నీ ఉన్నప్పటికీ Xiaomi 17 Ultra ఒక శక్తివంతమైన ఫోన్ అన్నది నిజం.
  5. బ్యాటరీ విషయానికి వస్తే, Galaxy S26 Ultra లో 5,000mAh బ్యాటరీ అందించనున్నారు.
  6. రూ. 32 వేలకే Vivo T4 Ultra.. ఈ ఆఫర్, తగ్గింపు ఎక్కడంటే?
  7. పనితీరు పరంగా ఈ ఐఫోన్‌లో ఆపిల్ రూపొందించిన A18 చిప్‌సెట్ ఉపయోగించారు.
  8. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వనున్నారు.
  9. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్24పై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు.. ఈ ఆఫర్‌ ఎక్కడంటే?
  10. లీకైన సమాచారం ప్రకారం, Galaxy F70e కనీసం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభించే అవకాశం ఉంది.
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »