4Q25లో అనేక బ్రాండ్లు తమ మినిమమ్ ఆపరేటింగ్ ప్రైస్లను (MOPs) సవరించుకున్నాయని ఒమ్డియా ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యం చౌరాసియా తెలిపారు. మెమరీ ధరల పెరుగుదలతో పాటు రూపాయి బలహీనత కారణంగా ధరల సవరణ తప్పనిసరైంది.
డిమాండ్ మరియు వ్యయ ఒత్తిళ్ల కారణంగా 2025 లో భారతదేశ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 1% తగ్గాయి; వివో మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది
ఒమ్డియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 నాల్గవ త్రైమాసికంలో (4Q25) భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ స్పష్టమైన మందగమనాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో భారత్లో మొత్తం 3.45 కోట్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే షిప్మెంట్ అయ్యాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గుదల. పండుగల అనంతరం డిమాండ్ తగ్గడం, ఛానెల్ల్లో అధిక నిల్వలు, రూపాయి బలహీనత, మెమరీ ధరల పెరుగుదలతో ఫోన్ల ధరలు పెరగడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా ఒమ్డియా పేర్కొంది. దీని ప్రభావం ముఖ్యంగా మాస్ మార్కెట్ వినియోగదారుల కొనుగోలు సామర్థ్యంపై కనిపించింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ vivo మార్కెట్ లీడర్గా నిలిచింది. 4Q25లో vivo 79 లక్షల యూనిట్లను షిప్ చేసి 23 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఇదే స్థాయిని మొత్తం 2025లోనూ కొనసాగించింది. Samsung 49 లక్షల యూనిట్లతో 14 శాతం మార్కెట్ షేర్తో రెండో స్థానంలో నిలిచింది. OPPO 46 లక్షల యూనిట్లు, 13 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానాన్ని దక్కించుకొని Xiaomiని వెనక్కి నెట్టింది. Xiaomi 42 లక్షల యూనిట్లతో నాల్గవ స్థానంలో ఉండగా, Apple 39 లక్షల యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
మొత్తం 2025లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 15.42 కోట్ల యూనిట్లు షిప్ అయ్యాయి. ఇది కేవలం 1 శాతం వార్షిక తగ్గుదలనే సూచిస్తోంది. వాల్యూమ్స్ స్థిరంగా కనిపించినప్పటికీ, మార్కెట్ క్రమంగా పరిపక్వ దశకు చేరుతోందని ఒమ్డియా విశ్లేషించింది. అధిక వాల్యూమ్ వ్యూహాల కంటే సరైన ధర–విలువ సమతుల్యత, బలమైన ఆఫ్లైన్ నెట్వర్క్, కట్టుదిట్టమైన ఇన్వెంటరీ నియంత్రణ ఉన్న బ్రాండ్లు మెరుగైన ఫలితాలు సాధించాయి.
4Q25లో అనేక బ్రాండ్లు తమ మినిమమ్ ఆపరేటింగ్ ప్రైస్లను సవరించుకున్నాయని ఒమ్డియా ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యం చౌరాసియా తెలిపారు. మెమరీ ధరల పెరుగుదలతో పాటు రూపాయి బలహీనత కారణంగా ధరల సవరణ తప్పనిసరైంది. పండుగల అనంతరం అధిక స్టాక్లతో మార్కెట్లోకి రావడంతో రిటైలర్లు కొత్త స్టాక్పై జాగ్రత్తగా వ్యవహరించారు. నవంబర్ తర్వాత అమ్మకాలు మరింత మందగించడంతో ఈ త్రైమాసికం ప్రధానంగా ఇన్వెంటరీ క్లియరెన్స్ దశగా మారింది.
ఈ పరిస్థితుల్లో vivo మరియు OPPO మాత్రమే డబుల్ డిజిట్ వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. vivo Y31 5G, Y19s 5G, T4X 5G, V60e వంటి మోడళ్లతో బలమైన అమ్మకాలు సాధించింది. విస్తృత ఆఫ్లైన్ ఉనికి, పెద్ద ప్రమోటర్ నెట్వర్క్ vivoకి కీలకంగా మారాయి. OPPO కూడా A సిరీస్ ద్వారా వాల్యూమ్, K సిరీస్ ద్వారా మెయిన్లైన్ రిటైల్లో స్థిరత్వాన్ని కొనసాగించింది.
ఇతర బ్రాండ్లకు ఈ త్రైమాసికం ఒత్తిడిగా మారింది. Samsung, Xiaomi, Apple విక్రయాలు పరిమితంగా ఉండగా, realme, OnePlus, Motorola, Nothing వంటి బ్రాండ్లు స్థిరత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశాయి. 2026లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ మధ్యస్థ స్థాయి పతనాన్ని చూడవచ్చని ఒమ్డియా అంచనా వేస్తోంది. ఇకపై కొత్త ఫీచర్లకంటే ఖర్చుల నియంత్రణ, రిటైల్ అమలు, ఫైనాన్సింగ్, ట్రేడ్-ఇన్లు, సర్వీస్ మరియు ఎకోసిస్టమ్ బండిలింగ్ వంటి ఛానెల్ ఆధారిత వ్యూహాలే మార్కెట్ను ముందుకు నడిపించనున్నాయి.
ప్రకటన
ప్రకటన