ఫోన్ తీసుకున్న వారు కేవలం 50 శాతం ఖర్చును మాత్రమే 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐల రూపంలో చెల్లిస్తారు.
Photo Credit: Gadgets 360
లక్షన్నర ఫోన్.. కేవలం రూ.6,500కే..!
శామ్సంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు అయిన గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26+ మోడల్స్ను ఇండియన్ మార్కెట్లోకి ఫిబ్రవరిలో గ్రాండ్గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వీటిని మరింత ఈజీగా సొంతం చేసుకునేలా 'గెలాక్సీ ఫరెవర్' పేరుతో ఒక క్రేజీ ఓనర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించి టెక్ వరల్డ్లో సంచలనం రేపింది. బడ్జెట్ టెన్షన్ లేకుండా ప్రీమియం ఫోన్ను వాడాలనుకునే గ్యాడ్జెట్ లవర్స్ కోసం ఇదొక సూపర్ డీల్ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, సగం ధరకు ఫ్లాగ్షిప్ ఫోన్ను వాడుకునే వెసులుబాటు కల్పించడం, దీనివల్ల కస్టమర్లపై ఒకేసారి భారీ ఆర్థిక భారం పడదు.
ఈ ప్రోగ్రామ్ మెకానిజం చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని ద్వారా ఫోన్ తీసుకున్న వారు కేవలం 50 శాతం ఖర్చును మాత్రమే 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐల రూపంలో చెల్లిస్తారు. ఒక సంవత్సరం పూర్తయ్యాక, కస్టమర్కు మూడు ఆప్షన్లు ఉంటాయి: ఒకటి ఆ ఫోన్ను రిటర్న్ చేసేయడం, రెండోది అప్గ్రేడ్ అవ్వడం, లేదా మిగతా బ్యాలెన్స్ కట్టి ఫోన్ను పూర్తిగా తన వద్దే ఉంచుకోవడం. ఈ 'నో క్వశ్చన్స్ ఆస్క్డ్' రిటర్న్ పాలసీ వల్ల యూజర్లకు చాలా ఫ్రీడమ్ లభిస్తుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తుంటే, 12 నెలల తర్వాత ఫోన్ను వాపస్ ఇచ్చి 50 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ పొందవచ్చు లేదా మిగిలిన సగం డబ్బును మరో ఏడాది పాటు ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.
శామ్సంగ్ ఫైనాన్స్+ ద్వారా ఈ ఆఫర్ తీసుకునే వారికి మరిన్ని వెసులుబాట్లు ఉన్నాయి. 12 నెలల తర్వాత కొత్త గెలాక్సీ ఫ్లాగ్షిప్ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, పాత ఫోన్ను తిరిగి ఇచ్చేసి లేటెస్ట్ మోడల్కు ఈజీగా అప్గ్రేడ్ అవ్వొచ్చు. ఒకవేళ ఫోన్ నచ్చి మీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే, 13వ నెలలో మిగిలిన 50 శాతం మొత్తాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ ప్రతి ఏటా మారుతున్న ఈ రోజుల్లో, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ను వాడాలనుకునే ట్రెండీ యువతకు ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పాలి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా శామ్సంగ్ ఇస్తున్న ఈ బైబ్యాక్ గ్యారెంటీ కస్టమర్లలో భరోసాను నింపుతోంది.
ఫోన్ కొన్నప్పుడు దాని రక్షణ గురించి కూడా శామ్సంగ్ అదిరిపోయే ప్లాన్ వేసింది. గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్లో భాగంగా రూ. 13,999 విలువైన శామ్సంగ్ కేర్+ మెంబర్షిప్ను 13 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల పొరపాటున ఫోన్ కింద పడి డ్యామేజ్ అయినా లేదా లిక్విడ్ డ్యామేజ్ జరిగినా అదనపు రిపేర్ ఖర్చుల గురించి వర్రీ అవ్వాల్సిన పనిలేదు. అయితే ఈ బెనిఫిట్స్ అన్నింటి కోసం కస్టమర్లు నెలకు రూ. 749.92 చొప్పున ఒక ఏడాది పాటు ప్రోగ్రామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిన్న మొత్తంతో మీకు బైబ్యాక్ గ్యారెంటీతో పాటు ఫోన్ ప్రొటెక్షన్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇది చాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది.
ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే, 12జీబీ + 256జీబీ వేరియంట్ గెలాక్సీ S26 అల్ట్రా ధర రూ. 1,39,999 గా ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద దీని నెలవారీ డివైజ్ ఈఎంఐ రూ. 5,833.29 పడుతుంది, దీనికి ప్రోగ్రామ్ ఫీజు కలిపితే మొత్తం నెలవారీ ఖర్చు రూ. 6,583.21 అవుతుంది. అలాగే గెలాక్సీ S26+ మోడల్ రూ. 1,19,999 ధరకు అందుబాటులో ఉండగా, దీని ఈఎంఐ,ఫీజు కలిపి నెలకు రూ. 5,749.88 అవుతుంది. ఇలా లక్షకు పైగా ఉన్న ఫోన్లను నెలకు ఐదారు వేల రూపాయలతో వాడుకునే ఛాన్స్ రావడం నిజంగా గ్రేట్ ఆఫర్. దీనివల్ల స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ తమ డ్రీమ్ ఫోన్ను ఈజీగా చేజిక్కించుకోవచ్చు.
గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్ శామ్సంగ్ డాట్ కామ్ వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 1500కు పైగా శామ్సంగ్ ఎక్స్పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది. రిటర్న్, సెటిల్మెంట్ ప్రాసెస్ సజావుగా సాగడం కోసం శామ్సంగ్ సంస్థ సర్వీఫై , డీఎంఐ ఫైనాన్స్తో జతకట్టింది. కేవలం సాధారణ కస్టమర్లకే కాకుండా కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా వారి పోర్టల్స్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించారు. మొత్తానికి మొబైల్ మార్కెట్లో శామ్సంగ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త వ్యూహం మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, యూజర్లకు లగ్జరీ టెక్నాలజీని చేరువ చేస్తోంది.
ప్రకటన
ప్రకటన