తుడారుమ్ సినిమా కాంట్రాక్ట్ బాధ్యతలతోపాటు, వ్యూహాత్మకమైన నిర్ణయాల కారణంగానే విడుదల ఆలస్యమైందని వెల్లడించింది.
Photo Credit: YouTube
తుదరమ్ 2025 మధ్యలో సినిమాల్లో విడుదల కానుంది.
ప్రముఖ నటులు మోహన్ లాల్, శోభన నటించిన మలయాళ థ్రిల్లర్ మూవీ తుడారుమ్ ఈ ఏడాది మధ్యలో థియేటర్లలో విడుదల కానుంది. మొదటగా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ, సినిమా విడుదల వాయిదా పడింది. జియో హాట్స్టార్తో ఒప్పందం కుదుర్చుకుని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ముందుగానే ఖరారు చేశారని నివేదికలు చెబుతున్నాయి. అయితే, విడుదల ఆలస్యం వెనుక ఉన్న కారణాలపై పలు ఊహాగానాలు ప్రచారమయ్యాయి. OTT హక్కులు అమ్ముడవ్వక పోకపోవడంతోనే వాయిదా పడిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ప్రొడక్షన్ పేర్కొంది. కాంట్రాక్ట్ బాధ్యతలతోపాటు, వ్యూహాత్మకమైన నిర్ణయాల కారణంగానే ఆలస్యమైందని వెల్లడించింది.
మోహన్ లాల్, శోభన నటించిన థ్రిల్లర్ మూవీ తుడారుమ్ ముందుగా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాతే జియో హాట్స్టార్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జనవరి 2025 ప్రారంభంలోనే సినిమా షెడ్యూల్ చేయబడిన థియేటర్ విడుదలకు ముందే హక్కులను పొందిందని తెలుస్తోంది. ఈ విషయం ప్రధానంగా పలు వేదికలపై కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇలాంటి వార్తలతో సంక్రాంతికే మూవీ ప్రేక్షకులను ఆలరిస్తుందని అందరూ భావించారు.
అయితే, మోహన్ లాల్ నటించిన చిత్రానికి ఈ ఒప్పందం అనుకున్నంత లాభదాయకంగా లేదని, ఇదే విడుదల ఆలస్యానికి కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ అంశంపై చిత్ర బృందం స్పందించడంతో ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. ముఖ్యంగా, ఈ సినిమా డిజిటల్ అరంగేట్రం దీని బాక్సాఫీస్ వద్ద వచ్చే స్పందనపై ఆధారపడి ఉండొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని వారాలలోపు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
తుడారుమ్ సినిమా అధికారిక ట్రైలర్ ఇంకా విడుదల కానప్పటికీ, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, ఈ మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా, కె.ఆర్. సునీల్ రచన అందించారు. రెజపుత్ర విజువల్ మీడియా పతాకంపై ఎం. రెంజిత్ ఈ సినిమాను నిర్మించారు. అయితే, ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన కథాంశం వెల్లడికానప్పటికీ, మోహన్ లాల్, శోభన జంటగా వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ జంట, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాలను అందుకున్నాయి. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.ఆర్. సునీల్ స్క్రీన్ ప్లే అందించగా, రెజపుత్ర విజువల్ మీడియా పతాకంపై ఎం. రెంజిత్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Infinix Note 60 Ultra Battery Details Revealed by US FCC Listing; Leaked Renders Hint at Secondary Display