Redmi Pad 2 : భారతదేశంలో రెడ్‌మీ ప్యాడ్ 2 ధర పెంపు.. వేరియంట్ కొత్త ధర ఎంతంటే?

ఇటీవల కాలంలో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్లే పలు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.

Redmi Pad 2 : భారతదేశంలో రెడ్‌మీ ప్యాడ్ 2 ధర పెంపు.. వేరియంట్ కొత్త ధర ఎంతంటే?

Photo Credit: Redmi Pad 2

Redmi Pad 2

ముఖ్యాంశాలు
  • షావోమీ కంపెనీ సంచలన నిర్ణయం
  • చిప్స్ రేట్లు పెరిగాయని ట్యాబ్ రేటు పెంచేశారు
  • భారతదేశంలో రెడ్‌మీ ప్యాడ్ 2 ధర పెంపు
ప్రకటన

Redmi Pad 2 : మీరు సరికొత్త ట్యాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు షావోమీ కంపెనీ ఒక చేదు వార్త చెప్పింది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన  రెడ్‌మీ ప్యాడ్ 2 ధరను కంపెనీ అకస్మాత్తుగా పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు జూన్ 29, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కంపెనీ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ట్యాబ్లెట్ బేస్ వేరియంట్ ధరపై రూ.1,000 వరకు పెంచారు. ఇటీవల కాలంలో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్లే పలు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు అదే బాటలో షావోమీ కూడా నడిచింది.

ప్రముఖ టిప్‌స్టర్ అషాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక రీటైల్ సర్క్యులర్‌ను షేర్ చేస్తూ ఈ ధరల పెంపు వివరాలను లీక్ చేశారు. కొత్త ప్రైస్ లిస్ట్ ప్రకారం.. రెడ్‌మీ ప్యాడ్ 2 లోని 4GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) వేరియంట్ గతంలో రూ.16,999 కి లభించేది. కానీ ఇప్పుడు రూ.1,000 పెరగడంతో దీని ధర రూ.17,999 కి చేరుకుంది. ఈ సరికొత్త ధరలు ఇప్పటికే కంపెనీ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో అప్‌డేట్ అయ్యాయి. అయితే, ఇప్పటికీ కొన్ని ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లు మరియు లోకల్ ఆఫ్‌లైన్ రీటైలర్ల దగ్గర పాత స్టాక్ అందుబాటులో ఉంటే.. ఈ ట్యాబ్‌ను పాత ధరకే పొందే అవకాశం కస్టమర్లకు లభించవచ్చు.

Delhi EV Policy : 2028 నుంచి పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు బంద్.. ఢిల్లీ ప్రభుత్వం హిస్టారికల్ నిర్ణయం

ధర పెరిగినప్పటికీ ఫీచర్ల పరంగా రెడ్‌మీ ప్యాడ్ 2 బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 11-ఇంచుల సైజు గల 2.5K డిస్‌ప్లేను అందించారు. ఈ ట్యాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0 పై రన్ అవుతుంది. ఇందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ హెలియో జీ100-అల్ట్రా ప్రాసెసర్‌ను అమర్చారు. అంతేకాకుండా, ఇందులో గూగుల్ సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని ఏఐ వంటి ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఇన్-బిల్ట్‌గా ఇవ్వడం విశేషం.

ఈ ట్యాబ్లెట్‌లో అన్నిటికంటే హైలైట్ ఫీచర్ దీని బ్యాటరీ లైఫ్. ఎక్కువ సమయం బ్యాకప్ ఇవ్వడం కోసం ఇందులో ఏకంగా 9,000mAh కెపాసిటీ గల మెగా బ్యాటరీని అమర్చారు. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్ కోసం వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆడియో విషయానికి వస్తే.. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న క్వాడ్ స్పీకర్ సిస్టమ్ (నాలుగు స్పీకర్లు) ఇందులో ఉంది. ఇక కనెక్టివిటీ పరంగా 4G, వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది నథింగ్ లేదా ఇతర బ్రాండ్ల లాగే స్మార్ట్ పెన్‎కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : నీరు, ధూళిని తట్టుకునే పవర్‌ఫుల్ బాడీ.. భారత్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M47 5G విడుదల
  2. UPI : ఇకపై నోటితో చెబితే చాలు యూపీఐ పేమెంట్స్ సక్సెస్.. రిమోట్ లాగా వాడేయొచ్చు
  3. Redmi Pad 2 : భారతదేశంలో రెడ్‌మీ ప్యాడ్ 2 ధర పెంపు.. వేరియంట్ కొత్త ధర ఎంతంటే?
  4. Nothing Phone 4b : స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో నథింగ్ సంచలనం.. జూలై 7న మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్
  5. Sony : ఏఐ ప్రాసెసర్, డాల్బీ అట్మోస్, జెమిని సపోర్ట్.. సోనీ సరికొత్త టీవీలు వచ్చేశాయ్
  6. Delhi EV Policy : 2028 నుంచి పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు బంద్.. ఢిల్లీ ప్రభుత్వం హిస్టారికల్ నిర్ణయం
  7. Huawei Mate 90 : కళ్లు చెదిరే కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. హువావే సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్
  8. Lava Agni 4 : అమెజాన్‌లో డిస్కౌంట్ల జాతర.. లావా ఫోన్ కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ రాదు
  9. Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7ఎఫ్ఈ 5జీపై భారీ డిస్కౌంట్
  10. Phone Comparison : మార్కెట్లోకి వీవో ఎక్స్ ఫోల్డ్ 6 ఎంట్రీ.. గూగుల్, శామ్‌సంగ్ ఫోన్లకు గట్టి పోటీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »