ఎయిర్ టెల్ యూజర్లకు ఓ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నెలకు సరిపోయే ఓ ప్లాన్ను యూజర్స్ వాడుకునే వారు. 24 రోజులకు గానూ రూ. 249తో రీఛార్జ్ చేసుకునే ప్లాన్ను ఎయిర్ టెల్ తీసేసింది.
Photo Credit: Reuters
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్
ప్రస్తుతం మొబైల్ను వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. వంద మందిని శాంపిల్గా తీసుకుంటే.. అందులో 99 మంది స్మార్ట్ ఫోన్లను వాడుతుంటారు. ఇక అందులో దాదాపు అందరూ నెల, మూడు నెలలు, ఆరు నెలలకు సరిపడా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇందులో 30 రోజులు, 84 రోజులు, 90 రోజులు వ్యాలిడిటీ ఉండి.. డేటా ఎక్కువగా ఇచ్చే ప్లాన్స్ను మాత్రమే యూజర్లు ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువగా వినియోగించని ప్లాన్స్ను జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు నిలిపి వేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎయిర్టెల్ రూ. 249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను నిలిపివేసింది. ఈ ప్లాన్ ప్రకారం 24-రోజుల చెల్లుబాటుతో 1GB రోజువారీ డేటా వస్తుంది. రూ.
249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యూజర్లకు అత్యంత సరసమైన ప్లాన్గా ఉండేది. ఇది రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్, రోజుకి 100 SMSలను ఇస్తుండేది. ఇక ఈ ప్లాన్లోని బెనిఫిట్స్ను అందుకోవాలంటే యూజర్లు కాస్త ధరను ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ధరకు తగ్గట్టుగా వ్యాలిడిటీ కాస్త ఎక్కువగా కూడా వస్తుంది. ఇక రూ. 249 ప్లాన్ను ఎయిర్ టెల్ నిలిపి వేయడంతో రిలయన్స్ జియో అడుగుజాడలను అనుసరించినట్టు అయింది. రూ. 249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను జియో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాన్ను ఆపిన రెండో టెలికాం ఆపరేటర్గా ఎయిర్ టెల్ నిలిచింది.
రూ. 249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో కనిపిస్తుంటుంది. “ధర సవరించబడింది” అనే ఓ గమనిక కూడా యాప్లో కనిపిస్తుంటుంది. దీనికి 24 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, 100 SMS, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్ వంటి ప్రయోజనాలను ఉంటాయి. దానితో పాటు అనేక కాంప్లిమెంటరీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ముందుగా, రూ. 249 ప్రీపెయిడ్ ప్యాక్తో రీఛార్జ్ చేయడం వల్ల ప్రీపెయిడ్ వినియోగదారులు ఇన్కమింగ్ కాల్లు, టెక్స్ట్ సందేశాల కోసం లైవ్ స్పామ్ హెచ్చరికలను స్వీకరించడానికి అర్హులయ్యారు. ఇది ఉచిత ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కంటెంట్, 30 రోజుల హెలోట్యూన్స్ కోసం సబ్స్క్రిప్షన్ను కల్పించేది.
ఎయిర్టెల్ ఇటీవల AI స్టార్టప్ పెర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుని రూ. 17,000 విలువైన 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను అందించింది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో ఈ ప్రయోజనం కూడా ఉంది.
నిలిపి వేసిన ప్లాన్ స్థానంలో రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్, మరిన్నింటిని అందించే ఎయిర్టెల్ అత్యంత సరసమైన ప్లాన్గా ఇది నిలుస్తుంది. ఇక ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీంతో వినియోగదారులు రూ. 249 ప్రీపెయిడ్ ప్యాక్ మాదిరిగానే ప్రయోజనాలను పొందగలుగుతారు. ధర కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. ఓ నాలుగు రోజుల వ్యాలిడిటీ ఎక్కువగా వస్తుంది.
జియో రూ. 249 ప్యాక్ను నిలిపి వేసిన తరువాత ఇతర ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను కూడా సవరించింది. 28 రోజుల కాల పరిమితికి ఇతర ప్రయోజనాలతో పాటు రోజుకు 1GB డేటాను అందించింది. ఇప్పుడు రూ. 299 ప్లాన్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకోగల అత్యంత సరసమైన ప్రీపెయిడ్ ప్యాక్గా మారింది.
భారతదేశంలో రూ. 249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను అందిస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్గా వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రమే మిగిలింది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset