భారత మార్కెట్లో ఈ సరికొత్త గేమింగ్ ల్యాప్టాప్ ధరను రూ.2,24,999 గా నిర్ణయించారు.
Photo Credit: HP
HyperX Omen 16 Valorant
HP : ప్రముఖ ల్యాప్టాప్ తయారీ సంస్థ హెచ్పీ భారతీయ గేమర్లను టార్గెట్ చేస్తూ ఒక అద్భుతమైన డివైజ్ను మార్కెట్లోకి తెచ్చింది. గేమింగ్ ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన రైట్ గేమ్స్ భాగస్వామ్యంతో సరికొత్త HP HyperX Omen 16 Valorant Limited Edition గేమింగ్ ల్యాప్టాప్ను అధికారికంగా విడుదల చేసింది. వలోరెంట్ గేమ్ ప్రియుల కోసం ప్రత్యేకమైన థీమ్, అత్యున్నత ఫీచర్లు, అల్ట్రా హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్పెషల్ హైపర్యాక్షన్ కీబోర్డ్తో ఈ ల్యాప్టాప్ను రూపొందించారు.
హై-ఎండ్ గ్రాఫిక్స్, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్
ఈ లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్లు గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇందులో 16 అంగుళాల (1,920 x 1,200 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లేను అందించారు. ఇది ఏకంగా 240Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేయడం వల్ల హై-ఎండ్ గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా విజువల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. దీనితో పాటు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, యాంటీ-గ్లేర్ కోటింగ్, లో బ్లూ లైట్ ఫీచర్లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో ఏఎమ్డీ రైజెన్ 7 (AMD Ryzen 7 8745HX) ప్రాసెసర్తో పాటు ఎన్విడియా జెఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్స్ కార్డ్ను అమర్చారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ల్యాప్టాప్లో 16GB DDR5 ర్యామ్ ఉంది. దీనిని భవిష్యత్తులో పెంచుకోవడానికి రెండు మెమొరీ స్లాట్లను ఇచ్చారు.
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఓమెన్ ఏఐ టెక్నాలజీ
ఈ ల్యాప్టాప్లో 83 Wh లిథియం-పాలిమర్ పవర్ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది రేసింగ్ స్పీడ్తో ఛార్జ్ అవుతుంది. కంపెనీ అందించిన 280W ఏసీ పవర్ అడాప్టర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలోని OMEN AI ఆప్టిమైజేషన్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ గేమ్స్ ఆడే విధానాన్ని బట్టి సిస్టమ్ ఇన్-గేమ్ సెట్టింగ్స్ను సులభంగా మార్చుకోవచ్చు. కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్, గిగాబిట్ ఈథర్నెట్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, మూడు యూఎస్బీ టైప్-ఏ పోర్ట్లు, 3.5mm హెడ్ఫోన్ జాక్లను అందించారు. ఇందులో ప్రైవసీ షట్టర్తో కూడిన 1080p ఫుల్ హెచ్డీ వెబ్క్యామ్, ఆడియో కోసం హెచ్పీ ఆడియో బూస్ట్, హైపర్ఎక్స్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.
Red Magic : గేమర్లకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త రెడ్ మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో లాంచ్
భారత్లో ల్యాప్టాప్ ధర ఎంతంటే?
భారత మార్కెట్లో ఈ సరికొత్త గేమింగ్ ల్యాప్టాప్ ధరను రూ.2,24,999 గా నిర్ణయించారు. దీనిని ఎంతో ఆకర్షణీయమైన బ్లాక్ ఫినిష్, బ్లాక్ క్రోమ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. హెచ్పీ అధికారిక ఆన్లైన్ స్టోర్తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్టాప్ అమ్మకానికి అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన