UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి

ప్రస్తుతం ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపులు వేగంగా జరుపుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి

UPI

ముఖ్యాంశాలు
  • యూపీఐ ట్రాన్సాక్షన్లకు డబ్బులు కట్టక్కర్లేదంటోయ్
  • యూపీఐ సేవల్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు
  • విమానాల్లోనూ డిజిటల్ పేమెంట్స్
ప్రకటన

UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే లావాదేవీలపై యూజర్లు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌లో చేసిన కొన్ని సవరణల వల్ల యూపీఐ యూజర్లపై చార్జీల భారం పడుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ (P2P) యూపీఐ లావాదేవీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చార్జీలు విధించబోమని స్పష్టం చేసింది.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలు 
వ్యాపారుల లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ గురించి కూడా ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. ఒకవేళ ఎండీఆర్ వర్తింపజేసినా, అది కేవలం ఒక నిర్ణీత పరిమితి దాటిన కొన్ని పరిమిత వ్యాపార లావాదేవీలపై మాత్రమే చాలా స్వల్పంగా ఉంటుంది. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లపై ఉండే ఎండీఆర్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ వినియోగదారులు చేసే ఎలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్లకు రూపాయి కూడా చార్జ్ పడదని తేల్చిచెప్పింది.

 రికార్డు స్థాయిలో లావాదేవీలు 
ప్రస్తుతం ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపులు వేగంగా జరుపుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన జులై నెలలోనే దేశంలో యూపీఐ ద్వారా సుమారు రూ. 29.9 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల లావాదేవీలు జరగడం విశేషం. భారత్ అభివృద్ధి చేసిన ఈ యూపీఐ పేమెంట్ సర్వీస్ ఇప్పటికే పలు విదేశాల్లో కూడా విజయవంతంగా ప్రారంభమై గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.

Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్

నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ 
సౌకర్యవంతమైన డిజిటల్ సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త ఆఫ్‌లైన్ పేమెంట్స్ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఎన్ఎఫ్‌సి (Near Field Communication) టెక్నాలజీ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌ను PoS టెర్మినల్‌పై టాప్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ప్రారంభంలో ఈ ఆఫ్‌లైన్ పేమెంట్స్ పరిమితి ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 2,000 వరకు ఉండే అవకాశం ఉంది. సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాలు, కొండప్రాంతాలు, ప్రయాణించే విమానాల్లో కూడా ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా రూ. 2,000 బడ్జెట్‌లోనే బెస్ట్ ఇయర్ బడ్స్
  2. iPhone 17: యాపిల్ లవర్స్‎కు ఊహించని షాక్.. ఆకాశాన్ని తాకనున్న ఐఫోన్ 17 ధరలు
  3. Flipkart Freedom Sale 2026:  ఫ్రీడమ్ సేల్ ధమాకా.. ఎల్‌జీ, శాంసంగ్, సోనీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు
  4. Amazon Freedom Sale 2026: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలపై భారీ ఆఫర్లు
  5. Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో ధమాకా డిస్కౌంట్లు.. సగం ధరకే బ్రాండెడ్ 55-ఇంచ్ 4K టీవీలు
  6. UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి
  7. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  8. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  9. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  10. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »