గూగుల్ సంస్థ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల భారీ ఏఐ హబ్ ప్రాజెక్ట్ తర్వాత.. ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా భారత్లో అడుగుపెట్టింది.
Photo Credit: Meta
Meta
Meta Reliance : భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అత్యంత వేగంగా ఒక పెద్ద గ్లోబల్ మార్కెట్గా రూపాంతరం చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలన్నీ ఇండియాలో తమ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే పనిలో పడ్డాయి. గూగుల్ సంస్థ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల భారీ ఏఐ హబ్ ప్రాజెక్ట్ తర్వాత.. ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా భారత్లో అడుగుపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి ఏఐ-ఇనేబుల్డ్ డేటా సెంటర్ను నిర్మించనున్నట్లు మెటా అధికారికంగా ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్తో మెటా మెగా కూటమి
ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం మెటా సంస్థ, భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్తో చేతులు కలిపింది. గుజరాత్లోని జామ్నగర్లో ఈ అత్యాధునిక డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. మెటా కంపెనీకి చెందిన గ్లోబల్ ఏఐ సిస్టమ్స్ను సపోర్ట్ చేయడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థలో మెటా సంస్థ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఒక బలమైన నిదర్శనంగా నిలవనుంది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్లకు మరింత స్పీడ్
జామ్నగర్లో నిర్మించబోయే ఈ డేటా సెంటర్ ప్రారంభ సామర్థ్యం 168 మెగావాట్లుగా ఉంటుందని, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి దీనిని మరింత పెంచుతామని మెటా స్పష్టం చేసింది. ఈ భారీ ఫెసిలిటీ నిర్మాణ బాధ్యతలను రిలయన్స్ సంస్థ చూసుకోనుంది. కాగా మెటా కంపెనీ ఈ సెంటర్ను తన అధీనంలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెనుక పనిచేసే ఏఐ సిస్టమ్స్, చాట్బాట్స్, రికమండేషన్ అల్గారిథమ్స్ కోసం ఉపయోగించుకోనుంది. భారత్లో మెటాకు ఉన్న భారీ యూజర్ బేస్కు దీనివల్ల అత్యంత వేగవంతమైన సేవలు అందనున్నాయి.
పర్యావరణ పరిరక్షణతో కూడిన సరికొత్త వ్యూహం
సాధారణంగా ఏఐ టెక్నాలజీని ఆపరేట్ చేయడానికి భారీ ఎత్తున కంప్యూటింగ్ పవర్, విద్యుత్, నీటి వినియోగం అవసరమవుతుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి భారీ ప్రాజెక్టులకు స్థానిక ప్రజల నుంచి పర్యావరణ పరంగా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే మెటా సంస్థ భారతదేశంలో ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. ఈ డేటా సెంటర్ను పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో నడపడమే కాకుండా, సర్వర్లను చల్లబరచడానికి సముద్రపు నీటిని డీశాలినేషన్ (ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చడం) చేసి వాడాలని నిర్ణయించింది.
క్లీన్ ఎనర్జీ కోసం భారీ ఒప్పందాలు
ఈ మెగా ప్రాజెక్ట్ విద్యుత్ అవసరాల కోసం మెటా ఇప్పటికే 900 మెగావాట్లకు పైగా క్లీన్ ఎనర్జీ కెపాసిటీని భద్రపరుచుకుంది. ఇందులో భాగంగా రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో క్లీన్మాక్స్ సంస్థ డెవలప్ చేస్తున్న సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నుండి 837 మెగావాట్ల విద్యుత్ అందనుంది. అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ నిర్మిస్తున్న ప్లాంట్ల నుంచి మరో 88 మెగావాట్ల స్వచ్ఛమైన ఇంధనాన్ని మెటా తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఇంధన, నీటి మౌలిక సదుపాయాల ఖర్చు మొత్తాన్ని మెటా సంస్థే భరించనుంది.
ఇంటర్నెట్ వేగాన్ని పెంచే ప్రాజెక్ట్ వాటర్వర్త్
జామ్నగర్ ఏఐ డేటా సెంటర్తో పాటు మెటా సంస్థ తన అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ అయిన ప్రాజెక్ట్ వాటర్వర్త్ గురించి కూడా ప్రస్తావించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సబ్సీ కేబుల్ సిస్టమ్ కావడం విశేషం. ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా నెట్వర్క్ అనుసంధానత కలిగిన అన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ వేగాన్ని, విశ్వసనీయతను విపరీతంగా పెంచవచ్చని మెటా తెలిపింది. రిలయన్స్, మెటా ల ఈ సరికొత్త భాగస్వామ్యం భారత డిజిటల్ రంగాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S25 Gets New Galaxy AI Features From Galaxy S26 With New One UI 8.5 Update
Ubisoft Shuts Down 2 More Studios, Lays Off Up to 380 Employees in Latest Round of Cost Cuts