ఈ రెండు టాబ్లెట్లు తమ లాంచ్ ధరలతో పోల్చితే ఇప్పుడు ఏకంగా రూ.3,000 వరకు ప్రియమయ్యాయి.
OnePlus Pad Go 2
OnePlus : ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం వన్ప్లస్ తన బడ్జెట్, మిడ్-రేంజ్ టాబ్లెట్ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వన్ప్లస్ ప్యాడ్ గో 2, వన్ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్ల ధరలను కంపెనీ ఒక్కసారిగా పెంచేసింది. పెరిగిన ఈ సరికొత్త ధరలు వన్ప్లస్ అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ స్టోర్లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఈ రెండు టాబ్లెట్లు తమ లాంచ్ ధరలతో పోల్చితే ఇప్పుడు ఏకంగా రూ.3,000 వరకు ప్రియమయ్యాయి. పండుగల సీజన్ ముగిసిన తర్వాత ఒక ప్రముఖ బ్రాండ్ తన ప్రొడక్ట్స్ ధరలను ఈ స్థాయిలో పెంచడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రామ్, స్టోరేజ్ విడిభాగాల ధరలు పెరగడమే కారణమా?
స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల తయారీలో ఉపయోగించే RAM, ఇంటర్నల్ స్టోరేజ్ వంటి కీలకమైన విడిభాగాల కొనుగోలు ఖర్చులు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోవడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తయారీ వ్యయం పెరగడంతో కంపెనీలు తమ పాత మోడళ్లపై కూడా రేట్లు పెంచక తప్పడం లేదు. కేవలం వన్ప్లస్ మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో నథింగ్, రియల్మీ, వివో, ఒప్పో, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా తమ పాపులర్ మొబైల్స్ ధరలను పెంచుకుంటూ పోయాయి.
వేరియంట్ల వారీగా వన్ప్లస్ ప్యాడ్ గో 2 కొత్త ధరల లిస్ట్ ఇదే
వన్ప్లస్ ప్యాడ్ గో 2 మోడల్కు సంబంధించిన అన్ని వేరియంట్ల ధరలపై కంపెనీ ఏకమొత్తంగా రూ. 1,000 చొప్పున పెంచింది. ఈ పెరిగిన ధరల ప్రకారం.. బేస్ వేరియంట్ అయిన 8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) మోడల్ ధర ఇప్పుడు రూ. 29,999 కి చేరింది. అలాగే, దీని మిడ్ వేరియంట్ అయిన 8GB RAM + 256GB స్టోరేజ్ (Wi-Fi) మోడల్ ధర రూ. 32,999 గా మారింది. ఇకపోతే హై-ఎండ్ వేరియంట్ అయిన 8GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన (5G) సెల్యులార్ మోడల్ సొంతం చేసుకోవాలంటే వినియోగదారులు ఇప్పుడు ఏకంగా రూ. 35,999 చెల్లించాల్సి ఉంటుంది.
బడ్జెట్ టాబ్లెట్ వన్ప్లస్ ప్యాడ్ లైట్ కొత్త ధరల వివరాలు!
మరోవైపు బడ్జెట్ విభాగంలో ఉన్న వన్ప్లస్ ప్యాడ్ లైట్ టాబ్లెట్ ధరలు కూడా మునుపటి కంటే చాలా పెరిగాయి. దీని బేస్ వేరియంట్ అయిన 6GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) మోడల్ ధరపై రూ.1,000 పెరగడంతో, దీని తాజా ధర రూ.19,999 కి చేరుకుంది. ఇక దీని టాప్ వేరియంట్ అయిన 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన సెల్యులార్ మోడల్పై కంపెనీ ఏకంగా రూ. 2,000 పెంచేసింది. దీనివల్ల ఈ వేరియంట్ కొత్త ధర ఇప్పుడు రూ. 22,999 కి చేరింది. ఈ కొత్త ధరలు వన్ప్లస్ స్టోర్ యాప్, రిటైల్ భాగస్వాముల వద్ద అప్డేట్ అయ్యాయి.
ఏకంగా రూ.3,000 పెరిగిన ధరలు
ఈ రెండు టాబ్లెట్లను మొదట మార్కెట్లోకి విడుదల చేసినప్పటి ధరలతో పోల్చి చూస్తే.. ఇప్పటివరకు జరిగిన మొత్తం ధరల పెంపు ఏకంగా రూ.3,000కి చేరింది. వన్ప్లస్ ప్యాడ్ గో 2 టాబ్లెట్ను డిసెంబర్ 2025లో రూ.26,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చారు. అలాగే వన్ప్లస్ ప్యాడ్ లైట్ మోడల్ జూలై 2025 లో కేవలం రూ. 15,999 ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ రెండు డివైజ్లు కూడా తమ ఒరిజినల్ లాంచ్ ధరల కంటే కచ్చితంగా రూ.3,000 అదనపు ధరతో విక్రయించబడుతున్నాయి. టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే సాధారణ మధ్యతరగతి వినియోగదారులపై ఇది ఖచ్చితంగా అదనపు భారమే అని చెప్పాలి.
ప్రకటన
ప్రకటన