Emergency Alert : తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల సమాచారం క్షణాల్లో మీ మొబైల్‌కు.. ఫోటోలతో సహా రానున్న మెసేజ్‌లు

భారతదేశపు ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌లో ఎన్‌డీఎంఏ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై తప్పిపోయిన వ్యక్తులను వెతకడానికి, నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ మొబైల్ అలర్ట్ సహాయపడుతుంది.

Emergency Alert : తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల సమాచారం క్షణాల్లో మీ మొబైల్‌కు.. ఫోటోలతో సహా రానున్న మెసేజ్‌లు

Photo Credit: Emergency Alert

Emergency Alert

ముఖ్యాంశాలు
  • ఇకపై మొబైల్ అలర్ట్ లౌడ్ సౌండ్ వెనుక పెద్ద ప్లాన్
  • తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల సమాచారం క్షణాల్లో మీ మొబైల్‌కు
  • కరుడుగట్టిన నేరగాళ్లు, దొంగల ఆట కట్టించనున్న సరికొత్త అలర్ట్ సిస్టమ్
ప్రకటన

Emergency Alert : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ గత కొంతకాలంగా ఎమర్జెన్సీ అలర్ట్ - సివియర్ అనే మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. పెద్ద శబ్దంతో ఫోన్ స్క్రీన్ మొత్తం ఆక్రమించే ఈ మెసేజ్‌ల వల్ల ప్రజలు తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. అయితే, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) ఈ మొబైల్ ఫోన్ బ్రాడ్‌కాస్ట్ ఎర్లీ వార్నింగ్ మెసేజ్ సిస్టమ్‌ను కేవలం విపత్తులకే పరిమితం చేయకుండా.. సమాజ రక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది.

నవభారత్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఎన్‌డీఎంఏ తమ అలర్ట్ సిస్టమ్‌లో ఒక అద్భుతమైన ఫీచర్‌ను చేర్చబోతోంది. ఎవరైనా చిన్న పిల్లలు, మానసిక స్థితి సరిగ్గా లేని వృద్ధులు లేదా ఇతరులు తప్పిపోతే వారిని వెతకడానికి ఈ సిస్టమ్‌ను వాడుకుంటారు. ఏ ప్రాంతంలోనైనా ఒక వ్యక్తి తప్పిపోయినట్లు కేసు నమోదైతే.. ఆ చోటుకు కొన్ని కిలోమీటర్ల పరిధిలోని ప్రజల మొబైల్ ఫోన్లకు సదరు వ్యక్తి ఫోటో, వివరాలతో కూడిన ఎమర్జెన్సీ మెసేజ్ వెంటనే వెళ్తుంది. దీనివల్ల స్థానిక ప్రజలు వెంటనే అలర్ట్ అయి, ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది.

ఈ సరికొత్త ఫీచర్ కేవలం మిస్సింగ్ కేసులకే కాకుండా.. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించనుంది. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు, కరుడుగట్టిన నేరగాళ్లు లేదా ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఏదైనా ప్రాంతంలో నక్కినట్లు సమాచారం ఉంటే.. వారి ఫోటోలను కూడా ఈ అలర్ట్ సిస్టమ్ ద్వారా ఆ పరిసర ప్రాంతాల ప్రజల మొబైల్ స్క్రీన్లపై ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. దీనివల్ల ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా, నిందితులు సమాజంలో ఎక్కడా దాక్కోకుండా వెంటనే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉంటుంది.

సాధారణంగా దొంగలను లేదా తప్పిపోయిన వారిని వెతకడానికి పోలీసులు పోస్టర్లు వేయడం, పత్రికల్లో లేదా టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం వంటి పాత పద్ధతులను వాడుతుంటారు. కానీ, ఈ డిజిటల్ అలర్ట్ సిస్టమ్ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే లక్షలాది మంది ప్రజల చేతుల్లో ఉండే మొబైల్ ఫోన్లకు నేరుగా సమాచారం చేరుతుంది. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేగాన్ని అమాంతం పెంచుతుంది. అయితే, ఈ సరికొత్త, ఉపయోగకరమైన ఫీచర్లను మొబైల్ అలర్ట్ సిస్టమ్‌లో అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తారనే దానిపై ఎన్‌డీఎంఏ నుంచి ఇంకా కచ్చితమైన తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »