మెల్బోర్న్ నగరంలో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నాయకుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Photo Credit: @narendramodi/Pixabay
Social Media
Social Media : ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆ దేశం ఏకంగా ఒక కఠినమైన చట్టాన్నే తీసుకొచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లల కోసం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రశంసించారు. ఈ కఠినమైన చర్య ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఒక గొప్ప రోల్ మోడల్గా నిలిచిందని, దీని నుంచి భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు.
తన పర్యటనలో భాగంగా మెల్బోర్న్ నగరంలో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నాయకుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి మోదీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను నియంత్రించడం, ఆన్లైన్ ప్రపంచం నుంచి యువతను రక్షించడం కోసం ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలు నిజంగా అభినందనీయమన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. "మీరు మీ దేశంలోని సమాజ రక్షణ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషల్ మీడియా చట్టాలలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రపంచానికి ఒక గొప్ప స్ఫూర్తి. మీరు చేస్తున్న ఈ ప్రయత్నాల నుంచి మేము కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాము" అని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
గత ఏడాది డిసెంబర్ నెలలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సంచలన చట్టాన్ని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఏ పిల్లాడు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయడానికి వీల్లేదు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఆ దేశంలోని పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, టిక్టాక్, స్నాప్చాట్, రెడ్డిట్ వంటి పాపులర్ ప్లాట్ఫామ్లను ఉపయోగించలేకపోతున్నారు. ప్రపంచంలోనే మైనర్ పిల్లలను సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేయకుండా నిరోధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆఫ్లైన్లో పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకోవడాన్ని పెంచడం, క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
Government Apps : ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు.. మీ ఫోన్లో కచ్చితంగా ఉండాల్సిన టాప్ 10 యాప్స్ ఇవే
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త చట్టంలో అత్యంత ఆసక్తికరమైన, కఠినమైన అంశం మరొకటి ఉంది. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కట్టడి చేయాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులది లేదా పిల్లలది కాదు. దీని బాధ్యత వంద శాతం ఆయా సోషల్ మీడియా టెక్ కంపెనీలదే అని చట్టంలో స్పష్టంగా రాశారు. దీనికోసం సోషల్ మీడియా కంపెనీలన్నీ ఆస్ట్రేలియాలో కఠినమైన వయసు నిర్ధారణ పద్ధతులను అమలు చేయాలి. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ నిబంధనలను ఉల్లంఘించి 16 ఏళ్ల లోపు పిల్లలకు తమ ప్లాట్ఫామ్లోకి ప్రవేశం కల్పిస్తే.. ఆ కంపెనీకి ఏకంగా 33 మిలియన్ యూఎస్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.280 కోట్లు) భారీ జరిమానా విధిస్తారు. ఈ భారీ ఫైన్ భయంతోనే కంపెనీలన్నీ వణికిపోతున్నాయి.
చిన్న వయసులో పిల్లలు సోషల్ మీడియా వాడటం వల్ల వారిపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడుతున్నాయని అనేక ప్రపంచ స్థాయి నివేదికలు హెచ్చరించాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులో సోషల్ మీడియా వాడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఆన్లైన్ లో కనిపించే ఫేక్ లైఫ్ స్టైల్ చూసి పిల్లల్లో విపరీతమైన ఆందోళన, ఆత్మన్యూనతా భావం పెరుగుతోంది. అంతేకాకుండా, గంటల తరబడి స్క్రీన్లు చూడటం వల్ల వారి నిద్ర విధానాలు పూర్తిగా పాడవుతున్నాయి. ఆన్లైన్ సైబర్ దాడులు, పనికిరాని చెత్త కంటెంట్ చూడటం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతోనే.. తల్లిదండ్రులకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి ఆస్ట్రేలియా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands