ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా గణనీయంగా పెరిగింది.
Maruti Suzuki
Tata Motors : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజురోజుకూ ఊపందుకుంటోంది. గత జూన్ నెలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల (కార్లు, ఎస్యూవీలు) అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 108 శాతం మేర భారీ వృద్ధిని నమోదు చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఇంధనంలో ఇథనాల్ బ్లెండింగ్ కలపడంపై వాహనదారుల్లో ఉన్న కొన్ని అపోహలు, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా మెరుగుపడటమే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కారు కొనాలనుకునే వారు ఈవీ మోడల్స్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ నెలలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా కేవలం 4.6 శాతంగా ఉండగా, ఈ ఏడాది జూన్ నాటికి అది ఏకంగా 7.7 శాతానికి చేరుకుంది. గత నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 31,823 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా 107.75 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. దీనిని బట్టి చూస్తే భారత్లో గ్రీన్ ఎనర్జీ వాహనాలకు ఆదరణ ఎంతలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
భారత ఈవీ కార్ల మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టాటా మోటార్స్ తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. గత జూన్ నెలలో టాటా మోటార్స్ ఏకంగా 12,187 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 126 శాతం కంటే ఎక్కువ వృద్ధి కావడం విశేషం. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం టాటా షోరూమ్లలో బుక్ అవుతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కారే ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో టాటా మోటార్స్ మొత్తం 34,467 ఈవీ కార్లను విక్రయించి, గతేడాది కంటే 112 శాతం వృద్ధిని కనబరిచింది.
Truecaller vs TRAI : ట్రూకాలర్కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త ఎత్తుగడ.. భారత మార్కెట్ ఎందుకు కీలకం?
టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ గత నెలలో ఐకానిక్ మోడల్ టాటా సియెర్రా ఈవీని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ పరంగా పాత ఐసీఈ మోడల్ కంటే చాలా భిన్నంగా, ఫ్యూచరిస్టిక్ లుక్తో వస్తోంది. ఈ కారుకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, జూలై 15 నుంచి కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త సియెర్రా ఈవీ ధరలు రూ. 18.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 24.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
ఈవీ ప్యాసింజర్ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా 7,766 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే మహీంద్రా 121 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం మహీంద్రా పోర్ట్ఫోలియోలో BE 6, XEV 9e, XEV 9S, XUV 3XO EV వంటి అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక 5,861 యూనిట్ల అమ్మకాలతో ఎంజీ మోటార్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఈ మార్కెట్లో నాల్గవ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ-విటారాను లాంచ్ చేసింది. ఈ కారును కంపెనీ ప్రత్యేకంగా Heartect-e ప్లాట్ఫామ్పై రూపొందించింది.
ప్రకటన
ప్రకటన