ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా 8 నుంచి 10 శాతానికి పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.6 శాతంగానే ఉండేది
EV Sales
EV Sales : గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం ఊహించని వేగంతో దూసుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరుగుతున్న మొత్తం వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు 12 శాతానికి చేరుకోగలదని ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ Ind-Ra తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ వృద్ధికి ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అత్యంత కీలకమైన దోహదకారిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.
దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, టీవీఎస్ రికార్డు
రేటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా 8 నుంచి 10 శాతానికి పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.6 శాతంగానే ఉండేది. తక్కువ రన్నింగ్ కాస్ట్, సులువైన ఛార్జింగ్ సదుపాయాలు, మార్కెట్లో రకరకాల మోడళ్లు అందుబాటులోకి రావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. గత నెల జూన్లో ఏకంగా 1,93,735 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 74.98 శాతం అధికం. ఇందులో ఐక్యూబ్ స్కూటర్లను విక్రయించే టీవీఎస్ మోటార్ కంపెనీ 47,064 యూనిట్ల విక్రయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. టీవీఎస్ ఇటీవల 10 లక్షల ఐక్యూబ్ స్కూటర్ల తయారీ మైలురాయిని కూడా దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
విపరీతంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్
ప్యాసింజర్ వాహనాల (కార్లు) విభాగంలో కూడా ఎలక్ట్రిక్ మోడళ్ల విక్రయాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల వాటా 6 నుంచి 8 శాతానికి చేరవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.37 శాతంగా నమోదైంది. గడిచిన జూన్ నెలలో దేశవ్యాప్తంగా 31,823 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది వార్షిక ప్రాతిపదికన ఏకంగా 107.75 శాతం పెరుగుదల. ఈ విభాగంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏకంగా 12,187 యూనిట్లను విక్రయించి 126 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని నమోదు చేసి ఆధిపత్యాన్ని చాటుకుంది.
Redmi Note 17 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్మీ నోట్ 17
ఊపందుకున్న ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఆటోలు, గూడ్స్ వాహనాలు) విభాగం కూడా ఎంతో ఆశాజనకంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో త్రీ-వీలర్ల విక్రయాల్లో ఈవీల వాటా సుమారు 65 శాతానికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 59 శాతంగా ఉండేది. వీటిని నడపడానికి అయ్యే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటం, అలాగే ప్రభుత్వం నుంచి లభిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, రాయితీలు ఈ రంగంలో అమ్మకాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
WhatsApp Adds Status Caption Editing Feature for Android Beta Testers: Report