Airtel : ఎయిర్‌టెల్ కొత్త 5G ప్రయోగం.. వివాదంలో చిక్కుకున్న ప్రయారిటీ సర్వీస్

ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ సరికొత్త నెట్‌వర్క్ సర్వీస్ భారతదేశంలోని నెట్ న్యూట్రాలిటీ సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది.

Airtel : ఎయిర్‌టెల్ కొత్త 5G ప్రయోగం.. వివాదంలో చిక్కుకున్న ప్రయారిటీ సర్వీస్

Photo Credit: Reuters

New users can switch to Airtel Priority Postpaid through the Airtel Thanks app

ముఖ్యాంశాలు
  • టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్ కొత్త ప్రయోగం
  • ఎయిర్‌టెల్ కొత్త 5G ప్లాన్‌పై కేంద్రం నిఘా
  • పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఫాస్ట్ ట్రాక్ ఇంటర్నెట్
ప్రకటన

Airtel : ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఇటీవలే ఇండియాలో ఒక ప్రత్యేకమైన  ప్రయారిటీ నెట్‌వర్క్ సర్వీస్‎ను ప్రారంభించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఎలాంటి సిగ్నల్ డ్రాప్స్ లేకుండా, సూపర్ ఫాస్ట్ ఫాస్ట్ లేన్ కనెక్టివిటీని అందించడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం కంపెనీ సరికొత్త 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని వాడుతోంది. అయితే, ఈ సర్వీస్ లాంచ్ అయిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం,  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) లూప్‌లోకి వచ్చాయి. ఈ కొత్త ప్లాన్ దేశంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలన మొదలుపెట్టారు.

నెట్ న్యూట్రాలిటీ రూల్స్ బ్రేక్ అయ్యాయా.. అసలేంటి ఈ నిబంధన?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ సరికొత్త నెట్‌వర్క్ సర్వీస్ భారతదేశంలోని నెట్ న్యూట్రాలిటీ సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది. నెట్ న్యూట్రాలిటీ అంటే.. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు  ఆన్‌లైన్ డేటా మొత్తాన్ని సమానంగా చూడాలి. డబ్బులు ఎక్కువ ఇచ్చారని కొందరికి ఎక్కువ స్పీడ్ ఇవ్వడం, తక్కువ ఇచ్చారని ఇతరుల ఇంటర్నెట్‌ను స్లో చేయడం లాంటివి చేయకూడదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కేవలం పోస్ట్‌పెయిడ్ వాళ్లకే ప్రత్యేక లైన్ కేటాయించడం ఈ నిబంధనల పరిధిలోకి వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి టెక్నికల్ వివరాలను సమర్పించాలని అధికారులు ఎయిర్‌టెల్‌ను కోరారు.

ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్యాయం జరుగుతోందా.. ట్రాయ్ ఆందోళన 
కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఈ సర్వీస్ వల్ల ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉన్న మెజారిటీ ప్రీపెయిడ్ వినియోగదారుల సేవల నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందా అనే కోణంలో ట్రాయ్ ఆరా తీస్తోంది. ఎయిర్‌టెల్‌కు ఇండియాలో ఉన్న మొత్తం 37.3 కోట్ల మంది మొబైల్ కస్టమర్లలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కేవలం 7.75 శాతం మాత్రమే ఉన్నారు. ఈ తక్కువ మంది విఐపి కస్టమర్ల కోసం నెట్‌వర్క్‌లో మెజారిటీ భాగం కేటాయిస్తే, మిగిలిన 92 శాతం కంటే ఎక్కువ మంది ఉన్న సాధారణ ప్రీపెయిడ్ యూజర్ల ఇంటర్నెట్ స్లో అయిపోతుందేమోనని నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 

Xiaomi 17T : భారత్‌లోకి షావోమి T సిరీస్ గ్రాండ్ కంబ్యాక్.. జూన్ 4న మోస్ట్ అవేటెడ్ షావోమి 17T లాంచ్

Google Gemini : గూగుల్ జెమిని ఇక సూపర్ యాప్.. అడోబ్, కాన్వా పార్ట్‌నర్‌షిప్‌తో నయా విప్లవం

 నెట్‌వర్క్ స్లైసింగ్ అంటే ఏంటి.. రిలయన్స్ జియో వ్యూహం ఎలా ఉంది?
అసలు ఈ 5G నెట్‌వర్క్ స్లైసింగ్ అంటే.. ఒకే ఒక ఫిజికల్ 5G నెట్‌వర్క్‌ను సాఫ్ట్‌వేర్ సాయంతో విడివిడి భాగాలుగా విభజించడం. ఎయిర్‌టెల్ తన స్టాండ్‌అలోన్ (SA) 5G ఆర్కిటెక్చర్ ద్వారా నెట్‌వర్క్‌లో ఒక ప్రత్యేక భాగాన్ని కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసమే రిజర్వ్ చేసి ఉంచింది. అయితే, ఇంటర్నెట్ హక్కుల కార్యకర్తలు మరియు టెక్ నిపుణుల ప్రకారం.. బ్రిటన్, అమెరికా, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఇటువంటి సిస్టమ్స్ అందుబాటులో ఉన్నందున, దీనిని నెట్ న్యూట్రాలిటీ ఉల్లంఘనగా నేరుగా చెప్పలేమని అంటున్నారు. ఇండియాలో కస్టమర్ల కోసం ఈ టెక్నాలజీని వాడిన మొదటి కంపెనీ ఎయిర్‌టెల్ కాగా, మరో దిగ్గజం రిలయన్స్ జియో  మాత్రం ఈ స్లైసింగ్ టెక్నాలజీని కేవలం తన ఎయిర్‌ఫైబర్ (FWA) హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకే పరిమితం చేసింది.

#తాజా కథనాలు
  1. Airtel : ఎయిర్‌టెల్ కొత్త 5G ప్రయోగం.. వివాదంలో చిక్కుకున్న ప్రయారిటీ సర్వీస్
  2. Realme : మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మి 16T.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు!
  3. Xiaomi 17T : భారత్‌లోకి షావోమి T సిరీస్ గ్రాండ్ కంబ్యాక్.. జూన్ 4న మోస్ట్ అవేటెడ్ షావోమి 17T లాంచ్
  4. Google Gemini : గూగుల్ జెమిని ఇక సూపర్ యాప్.. అడోబ్, కాన్వా పార్ట్‌నర్‌షిప్‌తో నయా విప్లవం
  5. Xiaomi : మార్కెట్లోకి వచ్చేసిన షావోమి స్మార్ట్ బ్యాండ్ 10 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు
  6. Oppo Vs Vivo : మొబైల్ మార్కెట్లో ప్రీమియం వార్.. వివో X300 అల్ట్రాకు పోటీగా ఒప్పో Find X9 Ultra లాంచ్
  7. Oppo Reno 16 : ఏకంగా 200MP కెమెరాతో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న ఒప్పో Reno 16
  8. HMD : రూ. 11 వేలకే 5G ఫోన్..6,000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చేసిన HMD వాల్యూమ్ 2
  9. Vivo S-Series : వివో అదిరిపోయే కంబ్యాక్.. చాలా ఏళ్ల తర్వాత భారత్‌లోకి S సిరీస్
  10. Vivo X500 Pro Max : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే సంచలనం.. ఏకంగా 8000mAh బ్యాటరీతో వస్తున్న వివో కొత్త మోడల్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »