Jio

Jio - ख़बरें

  • 2024 సెకెండ్ హాఫ్‌(H2)లో బెస్ట్‌ నెట్‌వర్క్ స్పీడ్‌లో Jio.. బెస్ట్ 5G గేమింగ్‌లో ఎయిర్‌టెల్ ఆగ్ర‌స్థానం
    ఇండియాలోని మార్కెట్ విశ్లేష‌ణ ప్ర‌కారం.. అన్ని సాంకేతిక ప‌రిజ్ఙానాల‌ను క‌లిసి 2024 సెకెండ్ హాఫ్‌(H2)లో మ‌న దేశంలో రిలయన్స్ Jio అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా అవ‌త‌రించింది. ఈ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ సిటీల్లో అత్యధిక 5G నెట్‌వ‌ర్క్‌ను అందించింది. దీని వినియోగదారులలో 73.7 శాతం మంది ఎక్కువ సమయం Jio 5G నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేశారు. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ 2024 సెకెండ్ హాఫ్‌లో బెస్ట్‌ వీడియో స్ట్రీమింగ్ అనుభవాలతోపాటు 5G గేమింగ్‌ను త‌మ వినియోగ‌దారుల‌కు అందించింది
  • జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. 90 రోజుల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, జియో ఎయిర్ ఫైబర్ సేవ‌లు
    ఇండియాలో రాబోయే క్రికెట్ సీజన్‌కు ముందు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై రిలయన్స్ జియో బంప‌ర్ ఆఫ‌ర్స్‌ను ప్రకటించింది. ఈ టెలికాం ప్రొవైడర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్‌లతో జియోహాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను, దీని వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవైన జియో ఎయిర్‌ఫైబర్ సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ప్ర‌క‌ట‌న‌తో జియో వినియోగ‌దారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి రాబోయే క్రికెట్ మ్యాచ్‌లను, ఇతర సినిమాలు, షోలు, అనిమే, డాక్యుమెంటరీలను వారి మొబైల్, టీవీలో 4Kలో చూసేందుకు అవ‌కాశం ఉంటుంది.
  • దేశంలో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు జియో స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం
    భార‌త్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, స్పేస్‌ఎక్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంతో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అత్యంత మారుమూల, గ్రామీణ ప్రాంతాలలో కూడా తమ‌ వినియోగదారులకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ యూనిట్‌ను ఉపయోగించు కోనున్న‌ట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ప్ర‌క‌టించింది. ఇండియాలో స్టార్‌లింక్‌ను విక్రయించడానికి SpaceX కంట్రోల్‌ అధికారుల నుండి అనుమ‌తులు పొందినట్లయితే, కస్టమర్ సర్వీస్ ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్‌తో పాటు రిలయన్స్ జియో స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.
  • రిలయన్స్ జియో కొత్త రూ. 100 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచిత JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందండి
    మ‌న దేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీని ద్వారా కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar నుండి కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేందుకు అవ‌కాశాం క‌ల్పిస్తోంది. ఇది ప్లాన్ ప్రయోజనాలతో పాటు ఉచిత JioHotstar సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. JioCinema, Disney+ Hotstar విలీనం తర్వాత ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇటీవల భార‌త్‌లో లాంఛ్ చేయ‌బ‌డింది. ఈ ప్లాన్‌ను పొందడం ద్వారా రిలయన్స్ జియో వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందాల్సిన అవసరం లేకుండా యాడ్‌-స‌పోర్ట్‌ గల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.
  • రిలయన్స్ జియో రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు క్రికెట్ డేటా ప్యాక్‌
    త‌మ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల కోసం రిలయన్స్ జియో స‌రికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప‌రిచ‌యం చేసింది. ముఖ్యంగా మ‌న దేశంలోని ICC మెన్స్‌ ఛాంపియన్స్ ట్రోఫీ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇది JioCinema, Disney+ Hotstar ల విలీనం త‌ర్వాత ఇటీవల లాంఛ్ చేసిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన JioHotstar కు ఉచిత subscription అందిస్తుంది. దీని వలన వినియోగదారులు ఇప్ప‌టికే మొద‌లైన క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సినిమాలు, షోలు, anime, డాక్యుమెంటరీలతోపాటు ఇతర లైవ్ క్రీడా కార్యక్రమాలను వీక్షించ‌వ‌చ్చు. అలాగే, ఇతర ప్రయోజనాలలో క్రికెట్ డేటా ప్యాక్ కూడా ఉంది.
  • జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్
    రిలయన్స్ జియో తన జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌ల‌లో కొంతమందికి రెండేళ్లపాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియం స‌ర్వీసులు యాక్సెస్‌ను అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఆఫర్ దేశంలోని జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు వారు ఎంపిక చేసిన ప్లాన్‌లతో అందించ‌బ‌డుతోంది. ఈ ప్రయోజనాలను స‌ద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, బ్యాగ్రౌండ్ ప్లేబ్యాక్‌కు స‌పోర్ట్ చేస్తుంది. అలాగే, ఇది యూట్యూబ్ మ్యూజిక్‌కు ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో చూసేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులకు అవ‌కాశం క‌ల్పిస్తుంది
  • రిలయన్స్ జియో రూ. 2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్.. అదిరిపోయే ప్ర‌యోజ‌నాలు పొందండి
    భార‌త్‌లోని రిలయన్స్ జియో తమ నెట్‌వ‌ర్క్‌ వినియోగ‌దారుల కోసం స‌రికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప‌రిచ‌యం చేసింది. ఈ ప్లాన్ దేశంలో అపరిమిత వాయిస్ కాల్స్‌, SMS సేవలతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇది చందాదారులకు రూ. 2150 విలువైన అదనపు ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఇస్తుంది. షాపింగ్ వెబ్‌సైట్‌లు, ఫుడ్ డెలివరీ యాప్‌ల‌తోపాటు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లపైన‌ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా రూ.400 మొత్తాన్ని వినియోగదారుల వార్షిక పొదుపుగా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్‌లను పొందేందుకు ఆసక్తి ఉన్న వినియోగ‌దారులు 2025, జనవరి 11వ తేదీలోగా రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది
  • స‌రికొత్త‌గా 21 దేశాలకు ISD మినిట్ ప్యాక్ రీఛార్జ్ ప్లాన్‌లను ప‌రిచ‌యం చేసిన Reliance Jio
    తాజాగా Reliance Jio 21 దేశాలకు కొత్త ఇంట‌ర్‌నేష‌న‌ల్‌ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రతి రీఛార్జ్‌పై ఆన్-కాల్ మినిట్‌ల‌ను అందించే కొత్త మినిట్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. కొత్త ISD రీఛార్జ్ ప్లాన్‌లు రూ. 39 నుంచి రూ. 99 మధ్య ప్రారంభమవుతాయి. ఈ కొత్త‌ ప్లాన్‌ల‌ను ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్యాక్‌లతో పాటు అనేక ముఖ్య‌మైన ఇంట‌ర్‌నేష‌న‌ల్ లోకేష‌న్స్ పే-యాజ్-యు-గో ప్యాక్‌ల రేట్లను కూడా కంపెనీ మార్పులు చేసింది
  • దీపావళి ధమాకా ఆఫర్‌.. ఏడాదిపాటు JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం
    భార‌తీయ టెలికాం దిగ్గ‌జం రిలయన్స్ జియో త‌న‌ JioAirFiber కోసం సరికొత్త దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా కొత్త వినియోగ‌దారుల‌తోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు ఒక ఏడాదిపాటు JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్‌ను పొందడానికి కొత్త కస్టమర్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో రూ. 20వేల వ‌ర‌కూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇప్పటికే ఉన్న వినియోగదారులు అదే ప్రయోజనాలను పొందేందుకు మూడు నెలల JioAirFiber ప్ర‌త్యేక‌ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇటీవల ఈ టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ కంపెనీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో Zomato గోల్డ్, OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందించింది.
  • ualcomm ప్రాసెస‌ర్‌తో విడుద‌లైన‌ JioPhone Prima 2 ఫీచ‌ర్స్ మీకోసం
    ప్ర‌ముఖ టెలికాం దిగ్గజం Jio మ‌న దేశీయ మార్కెట్‌లో Jio Phone Prima 2 ఫోన్‌ను విడుద‌ల చేసింది. నవంబర్ 2023లో భార‌త్‌లో ప్రవేశపెట్టన‌ JioPhone Prima 4G మోడ‌ల్‌కు మంచి ఆద‌ర‌ణ లభించ‌డంతో దాని అప్‌గ్రేడ్ వెర్స‌న్‌గా Jio నుండి వచ్చిన ఫీచర్ ఫోన్‌గా దీనిని లాంచ్ చేసింది. అంతేకాదు, గ‌తంలో విడుద‌ల చేసిన JioPhone Prima హ్యాండ్‌సెట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచ‌ర్స్‌ను జోడించింది. తాజా JioPhone Prima 2 హ్యాండ్‌సెట్‌ Qualcomm ప్రాసెస‌ర్‌, 2,000mAh బ్యాటరీతో 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో రూపొందించారు. ఇది వెనుక మరియు ముందు కెమెరాలను కలిగి ఉంటుంది
  • Reliance Jio 8వ వార్షికోత్సవం సంద‌ర్భంగా అధిరిపోయే ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించింది
    Reliance Jio 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్ర‌క‌టించింది. టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు బండిల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల పరిమిత సభ్యత్వంతోపాటు అర్హత ఉన్న ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ-కామర్స్ వోచర్‌లతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. Jio మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా ఇటీవ‌ల‌ భారతదేశంలోని తన కస్టమర్‌ల కోసం ముఖ్యమైన ప్రకటనలు చేసిన విష‌యం తెలిసిందే. Jio ఇప్పటివరకూ సుమారు 490 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లకు సేవలను అందిస్తోంది
  • JioAirFiber 5G సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించ‌బోతోన్న రిలయన్స్
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం సంద‌ర్భంగా ఆ సంస్థ‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 5G కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ జియో వృద్ధితోపాటు మరిన్ని రంగాలలో కంపెనీ సాధిస్తున్న పురోగతి గురించి అంబానీ వివ‌రించారు. Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ని కూడా ప్రవేశపెట్టారు. ఈ ఆఫర్‌తో జియో వినియోగదారులు 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారు. ఈ ఏడాది దీపావళికి వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నారు.
  • పెరిగిన Reliance Jio ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధ‌ర‌లు.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో బంప‌ర్ ఆఫ‌ర్‌
    కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో వచ్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను Reliance Jio పెంచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మ‌న దేశంలో టెలికాం కంపెనీలు త‌మ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల రేట్లను పెంచుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు Jio కూడా దానిని కొన‌సాగించేలా ఈ త‌ర‌హా టారీఫ్ పెంపును ప్ర‌క‌టించిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కంపెనీకి పోటీదారులుగా ఉన్న‌ Vodafone Idea (Vi), భారతి Airtel ఏకకాలంలో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు పెరిగిన టారిఫ్‌లను ప్రకటించాయి. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో సవరించబడిన కొత్త‌ Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు 84 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంతేకాదు, ఈ రెండు ప్లాన్‌లు కూడా 5G డేటా బెటిఫిట్‌తో వ‌స్తున్నాయి.
  • నెల‌వారీ రీచార్జ్ ఎక్కువ అవుతోంద‌ని బాధ‌ప‌డుతున్నారా? అయితే Jio రూ. 198 ప్లాన్ మీకోస‌మే!
    అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను Jio యూజ‌ర్ల కోసం అందిస్తోంది. అయితే, Reliance Jioతో సహా దేశంలోని వివిధ టెలికాం సంస్థ‌లు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను ఇటీవ‌ల‌ పెంచిన విష‌యం తెలిసిందే.
  • 455+ చానెల్స్‌ యాక్సెతో JioBharat J1 4G ఫోన్ ధ‌ర కేవ‌లం రూ.1799
    JioTV, JioCinema, JioPay వంటి అప్లికేషన్‌లతో ముందే ఇన్‌స్టాల్ చేసి JioBharat J1 4G ఫోన్‌ను వినియోగ‌దారుల‌కు అందించ‌బోతున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది.

Jio - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »